ఏపీ ఎమ్ సిఏ అసోసియేషన్ నిరసనలో భాగంగా గురువారం వెనీగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజర్ కె. సంధ్య రాణి మాట్లాడతూ.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ప్రధాన సమస్యలు అయినా రెగ్యులర్ ఇంక్రిమెంట్, పెండింగ్ ఇన్సంటివ్స్ వెంటనే విడుదల చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కె రవితేజ, ఎమ్. జ్యోష్న, ఎన్. మాలతి, సి హెచ్. నీతిష ఇతర సిబ్బంది పాల్గొన్నారు.