ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలని పెద్దకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కోరారు. బుధవారం పెదకూరపాడు లోని జడ్పీ హైస్కూల్ లో పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అర్తిమల్ల రమేష్ సతీమణి నళినీ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంను భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకు గ్రామస్థులు కూడా సహకరిస్తే ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు.