వడ్లమూడి క్వారీ బాల కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శన ఘనంగా జరిగింది. హోం మంత్రి వంగలపూడి అనిత, నీటిపారుదల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, మైనార్టీ సలహాదారుడు షరీఫ్, బ్రహ్మం చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి జీవితం అంకితమైన వీరయ్య ఆశయాలను కుమారుడు ధూళిపాళ్ల నరేంద్ర కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. పోటీల్లో విజేతలకు బైకులు, నగదు బహుమతులు అందజేశారు.