మన్నవ గ్రామంలో టీ స్టాల్ వద్ద జరిగిన ఘర్షణ పై టీడీపీ ఎమ్మెల్యే పొన్నూరు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ స్పందించారు. ఈ సంఘటనను వైసీపీ కుట్రగా అభివర్ణిస్తూ, తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలో వైసీపీకి చెందినవారు కనిపించారని తెలిపారు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వైసీపీ ఆసుపత్రికి తీసుకెళ్లడం సందేహాలకు తావిస్తోంది. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.