గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణంలోని 22వ వార్డు ముబారక్ నగర్ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం కిశోర వికాసం కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఐసిడిఎస్ సిడిపిఓ ఎస్ వెంకటరమణ పాల్గొని గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఆపత్కాలంలో 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని అవగాహన కల్పించారు. కిశోర వికాసం కార్యక్రమం పై వివరించారు. అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.