గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ని అగ్నిమాపక కేంద్రం అధికారి కే ప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం ఒకటో వార్డు లోని పాఠశాల విద్యార్థులకు, అపార్ట్మెంట్లో ని ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా డెమో నిర్వహించి అగ్ని ప్రమాదాల విద్యుత్ ప్రమాదాలు , నివారణ, తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. పాంప్లెట్లు పంచిపెట్టి ప్రమాదాలు జరిగినప్పుడు 101, 112 ఫోన్ చేయాలని సూచించారు.