గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేంచేసి ఉన్న ప్రసిద్ధి శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ సాక్షి భవననారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారికి పంచామృత స్నపన తిరువంజనోత్సవం నిర్వహించారు. అనంతరం రాత్రి రాజాధిరాజా వాహనంపై స్వామి వారిని పట్టణ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ప్రజలు స్వామివారిని దర్శించుకుని పూజలు అందించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.