పొన్నూరు మండలం వడ్డీముక్కల గ్రామానికి చెందిన కౌలు రైతు తన్నీరు శ్రీనివాసరావు నిడుబ్రోలుకు చెందిన నన్నపనేని వీరయ్య చౌదరి దగ్గర నగదు వడ్డీకి తీసుకొని సగం నగదు చెల్లించాడు. 2నెలల క్రితం అనుచరులతో శ్రీనివాసరావుపై దాడి చేసి ట్రాక్టర్ ను ఎత్తుకెళ్లిపోయారని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని మనస్థాపం చెంది శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు జి జి హెచ్ కి తరలించారు.