పొన్నూరులో గురువారం సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన సభలో పుప్పాల సత్యనారాయణ మాట్లాడారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడం కమ్యూనిస్టుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పార్టీ ఉద్యమాలతో అనేక కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లభించాయని చెప్పారు. సభలో ఆరేటి రామారావు, దేవరకొండ శ్రీనివాస్, మదీనా షకీల, యశోద తదితరులు పాల్గొన్నారు.