వడ్లమూడి క్వారీలో శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి జ్ఞాపకార్ధంగా డివిసి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో ప్రధమ బహుమతి రాయల్ ఎంఫిల్డ్ బుల్లెట్, ద్వితీయకు హోండా యూనికాన్, తృతీయకు హోండా ఎక్స్ట్రీమ్ లభించగా, 4వ గ్లామర్ బైక్, 5వ బహుమతి హోండా షైన్ అందజేశారు. 6వ నుండి 10వస్థానాలకు నగదు బహుమతులు లభించాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు ధూళిపాళ్ళ నరేంద్ర, ఆయన కుమార్తె ధూళిపాళ్ళ వైదీప్తి బహుమతులు అందజేసి అభినందించారు.