గుంటూరు: ఎఫ్.పి.ఓలకి నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం

81చూసినవారు
గుంటూరు: ఎఫ్.పి.ఓలకి నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం
వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ లో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPO) శిక్షణా శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, రైతుల అభివృద్ధికి FPOలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్, నాణ్యత వంటి అంశాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్