కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని పాలకేంద్రంలో సంఘం డైరీ ఆధ్వర్యంలో బుధవారం బోనస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రూ.100కు రూ.5 చొప్పున బోనస్ లెక్కించగా, మొత్తం 69 మంది పాల ఉత్పత్తిదారులకు రూ.1,23,550 బోనస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పాలకవర్గ సభ్యుడు జలిరెడ్డి వెంకట సుబ్బయ్య, బాపట్ల విభాగ జోనల్ మేనేజర్ తేలప్రోలు వీరేంద్రకుమార్, అప్పికట్ల ఎంసీసీ పిల్ కోఆర్డినేటర్ సుధీర్ పాల్గొన్నారు.