గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సిబ్బంది ఆందోళన చేశారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలని, పెండింగ్ ఇన్సెంటివ్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతారేళ్లుగా జీతభత్యాలు పెంచలేదని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆయుష్మాన్ భారత్ సిబ్బంది డిమాండ్స్ ను నెరవేర్చాలని సిహెచ్ఓ ప్రవల్లిక తెలిపారు.