గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోవైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం స్వాతంత్ర్య సమరయోధులు, సమతావాది, భారత మాజీ ఉప ప్రధాని "డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్" వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.