వైసీపీ ఆవిర్భావ వేడుకలు బుధవారం చెరుకుపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. రేపల్లె వైసీపీ ఇన్చార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ ఆధ్వర్యంలో గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగరవేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మొండి ధైర్యంతో ఢిల్లీ పెద్దలను ఎదిరించి ప్రజా పోరాటాలకు సిద్ధపడి 15 ఏళ్లు అయిందన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసిపి పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.