కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రేపల్లె వైసిపి ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ పల్లె పడక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెరుకుపల్లి మండల వైసీపీ కన్వీనర్ దుండి వెంకట రామిరెడ్డి తెలిపారు. గురువారం చెరుకుపల్లి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన డాక్టర్ గణేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పడక కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.