వ్యవసాయ యాంత్రీకరణ పథకం లో భాగంగా రేపల్లె నియోజకవర్గం లోని నాలుగు మండలాల రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేశారు. శనివారం చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందజేశారు. నియోజకవర్గంలోని 112 మంది లబ్ధిదారులకు 44,90,626 విలువగల యంత్ర పరికరాలను 18,43,580 రూపాయల రాయితీతో రైతులకు అందించారు.