పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్దంలో సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన జవాను మురళీ నాయక్ వీర మరణం పొందడం తీవ్ర వేదనను కల్గించిందని రేపల్లె ఎమ్మెల్యే, రెవెన్యూ శాఖ మంత్రి, సత్యసాయి, తిరుపతి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన మురళీ నాయక్ వీర మరణం దేశ ప్రజలందరికీ స్పూర్తి దాయకం అన్నారు. మురళీ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.