నిజాంపట్నం గ్రామ దేవత మోగదారమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం వేడుకలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మగధారమ్మ అమ్మవారి పుట్టింటి కార్యక్రమాన్ని మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రామారావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మొగధారమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.