విద్యుత్ లైన్ల మరమ్మతులు కారణంగా ఈ నెల 12వ తేదీ శనివారం రేపల్లె పట్టణ, రూరల్ గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యామ్ సుధాకర్ బాబు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులు, వ్యాపారస్తులు విద్యుత్ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని డిఈఈ శ్యామ్ సుధాకర్ బాబు కోరారు.