రేపల్లె నియోజకవర్గంలో సోమవారం నుండి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి 31. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెరుకుపల్లి మండలంలో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 16. 8 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 10. 8 మిల్లీమీటర్లు, రేపల్లె మండలంలో 1. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షాలు ఇంకా కొనసాగితే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.