రేపల్లె పట్టణంలోని ఆంధ్రరత్న రైస్ అండ్ ఫ్లోర్ మిల్ వద్ద పిడిఎస్ బియ్యం అమ్ముతున్నారన్న సమాచారంతో శనివారం రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జున రావు ఆధ్వర్యంలో ఎస్సై రాజశేఖర్, సిబ్బంది దాడి చేసి 16 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిడిఎస్ బియ్యం అమ్ముతున్న రైస్ మిల్ ఓనర్ శ్రీకాకుళం రామకృష్ణ, గుంటూరు పెదపలకలూరుకు చెందిన కస్తూరి సాయి దిలీప్, లారీ డ్రైవర్ దాసరి బ్రహ్మయ్య లను అదుపులోకి తీసుకున్నారు.