రేపల్లెలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థ్యాలు-నిర్వహణ అనే అంశం మీద విద్యార్థిని విద్యార్థులకు అవగాహనా సదస్సును నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవిచంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తమగృహాలలో పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను సక్రమమైన మార్గంలో డీ కంపోజ్ చేయాలన్నారు. డాక్టర్ రవీంద్ర, డాక్టర్ దాసు పాల్గొన్నారు.