ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ సైనికుల క్షేమం, ప్రధాని నరేంద్ర మోదీకి శుభం కలగాలని కోరుతూ రేపల్లె బీజేపీ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించింది. రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు రేపల్లె రైలుపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చన చేశారు. దేశ రక్షణలో ఉన్న సైనికుల ధైర్యసాహసాలను కొనియాడుతూ, వారి క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు.