పాకిస్థాన్తో జరుగుతున్న యుద్ధంలో సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడం తీవ్ర వేదన కలిగించిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు. మురళీ నాయక్ ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి చెప్పారు.