కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడెలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈనెల 20న కార్మిక సంఘాలు నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు నాగాంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం రేపల్లెలో జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో నాగాంజనేయులు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 44 చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసిందన్నారు.