రేపల్లె: ఈనెల 20న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

80చూసినవారు
రేపల్లె: ఈనెల 20న జరిగే సమ్మెను జయప్రదం చేయండి
కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 20వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య కోరారు. శనివారం రేపల్లెలో జరిగిన కార్మిక సంఘాల ఉమ్మడి సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మె చేపట్టామన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని రద్దుచేసి కనీస వేతనం 20వేలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్