రేపల్లె: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన శివప్రసాద్

69చూసినవారు
రేపల్లె: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన శివప్రసాద్
అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అన్నారు. నిజాంపట్నం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ షరీఫ్ అనారోగ్య కారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. వైద్య ఖర్చులు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నుండి మంజూరైన 1,99,895 రూపాయల చెక్కును గురువారం శివప్రసాద్ అందజేశారు.

సంబంధిత పోస్ట్