సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేల పేరుతో పందెపు కోళ్లకు కత్తులు కడితే కఠిన చర్యలు తీసుకుంటామని రేపల్లె పట్టణ సిఐ మల్లికార్జున హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు శనివారం రేపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో కోళ్లకు కత్తులు కట్టే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. పందెం కోళ్లకు కత్తులు కడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.