చిలకలూరిపేట పట్టణంలో రాత్రి వేళల్లో బైక్ దొంగతనాలు పెరుగుతున్నాయి. తార్ష్ బజార్లో నివసించే షేక్ షాజహాన్ ఇంటి ముందు పార్క్ చేసిన బుల్లెట్ బైక్ మంగళవారం ఉదయం కనిపించకపోవడంతో, చోరీకి గురైందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనాస్థలంలో దర్యాప్తు ప్రారంభించారు.