దాచేపల్లి తహశీల్దార్గా శ్రీనివాస్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన కారంపూడి, అచ్చంపేట మండలాల్లో సేవలందించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందేలా కృషి చేస్తానని అలాగే రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.