గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడును సత్తెనపల్లికి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మేయర్ కార్యాలయంలో శనివారం కలిశారు. మేయర్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం వారి పార్టీ విషయాలపై చర్చించుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పార్టీ అభ్యున్నతికి సమర్థవంతంగా పనిచేయాలని మేయర్ భార్గవ రెడ్డికి సూచించారు.