రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై సూరె ముక్కంటి(42)అనే కూలి ఆదివారం మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న భవనానికి పరంజీ ఏర్పాటు చేసే క్రమంలో ఇనుప పైపును తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.