తాడికొండలో నేడు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సమతా వాణి తెలిపారు. ఈ సమావేశం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలి ఆధ్వర్యంలో జరగనున్నట్లు పేర్కొన్నారు. కో-ఆప్షన్ సభ్యులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పూర్తి సమాచారంతో తప్పకుండా హాజరుకావాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలు, కీలక అంశాలపై చర్చించనున్నారు.