గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెం దళిత బాలిక శైలజ హత్యకేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్ధనరావుకుమంగళగిరిలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఏబీసీడీ కన్సోలేషన్ ప్రైజ్" (డీజీపీ మెడల్) అవార్డు లభించింది. నిందితుడు నాగరాజును మూడునెలల్లో అరెస్ట్ చేశారు. విజయవంతమైన విచారణకు గాను మరో నలుగురు పోలీసులకు కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అవార్డులు అందించారు.