దుగ్గిరాల మండలానికి చెందిన ఎంపీపీ షేక్ జబిన్ ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. గురువారం మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో లోకేష్ చేతుల మీద కీలక ఉత్తర్వులు అందుకున్నారు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. షేక్ జబిన్ నియామకంతో దుగ్గిరాల మండలవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హజ్ యాత్రికుల సేవలో నిస్వార్థంగా, సమర్పిత భావంతో పనిచేస్తానని షేక్ జబిన్ తెలిపారు.