తాడికొండలో పాడి రైతులకు సబ్సిడీ దాణా పంపిణీ : శ్రావణ్ కుమార్

70చూసినవారు
తాడికొండలో పాడి రైతులకు సబ్సిడీ దాణా పంపిణీ : శ్రావణ్ కుమార్
తాడికొండ మండలంలోని పొన్నెకల్లులో పాడి రైతులకు సబ్సిడీపై మంజూరైన పశువుల దాణాను శుక్రవారం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, పాడి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వారి ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు దాణా, మేత, పశు వైద్యసేవలు అందించబడుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాడి రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్