అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల ఏర్పాటు కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి (ఈ-3) పక్కన భూగర్భంగా విద్యుత్ కేబుళ్ల కోసం హెచ్డీపీఈ సిలికాన్ పైపుల ఏర్పాటును అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ చేపట్టింది. శనివారం ఉద్దండరాయునిపాలెం వద్ద ఎన్సీసీ గుత్తేదారు సంస్థ ఈ పనులను ప్రారంభించి, 5 పైపులను లేయర్లుగా అమరిస్తోంది.