రైతులకు పరిహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి

62చూసినవారు
రైతులకు పరిహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి
అగ్ని ప్రమాదం జరిగి 190 రోజులు గడుస్తున్నా రైతులకుపరిహారం చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతుసంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. దుగ్గిరాల శుభంమహేశ్వరి కోల్డ్‌ స్టోరేజిలో జనవరి 19న అగ్నిప్రమాదం జరిగి, పసుపు రైతులు నష్టపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అంగీకరించిన ప్రకారం పరిహారం తక్షణమే చెల్లించాలని కోరుతూ తెనాలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఆయన వినతిపత్రం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్