దుగ్గిరాలలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

66చూసినవారు
దుగ్గిరాలలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
దుగ్గిరాల డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో శనివారం నుండి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 జట్లు పాల్గొన్న ఈ పోటీలను మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య హాజరై, యువతలో నైపుణ్యాల పెంపునకు క్రీడలు కీలకమని చెప్పారు. విజేతలకు రూ. 50,000, రన్నరప్‌కు రూ. 30,000 అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్