ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరులో సూపరింటెండెంట్ రమణ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే డాక్టర్-పేషెంట్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా వేసవి ఆహార నియమావళిపై అవగాహన కల్పించారు. అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా నర్సింగ్ సిబ్బంది పేద రోగుల కుటుంబాలకు 25 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పాటించాల్సిన నియమావళిని వివరించడంతో పాటు సిబ్బందితో సహకరించాలని సూచించారు.