ఆటోను లారీ ఢీ కొట్టిన ఘటన దుగ్గిరాల మండలం, మోరంపూడి లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు. విజయవాడ నుంచి పండ్ల లోడుతో వస్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న పండ్లన్ని చెల్లాచెదురుగా పడ్డాయి. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.