గుంటూరులోని మల్లయ్య లింగం భవన్లో కార్మిక సంఘాల సదస్సు శనివారం జరిగింది. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేంతవరకు పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్మిక హక్కుల హరించడాన్ని నిరసిస్తూ గ్రామాల్లో ప్రచారం, బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కనీస వేతనం రూ. 26, 000, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఉద్యమిస్తామన్నారు.