మేడికొండూరు మండలంలోని పేరేచర్లలో ఆదివారం స్కై సిటీ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, APIDC ఛైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. బ్రోచర్ను ఆవిష్కరించారు. సామాన్యుల ఇంటి కలల్ని సాకారం చేయడమే లక్ష్యంగా సంస్థ ముందడుగు వేసిందన్నారు. అమరావతి అభివృద్ధి ప్రపంచానికి సమానమవుతుందన్నారు.