దుగ్గిరాల వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

69చూసినవారు
దుగ్గిరాల వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
దుగ్గిరాల వద్ద ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొల్లిపర మండలం వల్లభాపురం నుంచి గుంటూరు వెళుతున్న గుంటూరు డిపో బస్సు ఈమని వద్ద కమాన్ కట్టల పిన్ విరిగి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ప్రాణ నష్టం జరగలేదు అని ప్రయాణికులు చెప్పారు.

సంబంధిత పోస్ట్