ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయటంపై టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం అమృతలూరు మండలం మూల్పూరులో వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మొదటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్నారన్నారు. ప్రమోద్, మూల్పూరు ఏసురత్నం, ఆరెమండ వినయ్ బాబు, చిలుమూరు బాబు మాట్లాడారు.