కౌలు రైతులు అందరూ సీసీ కార్డులను పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రసన్న అన్నారు. అద్దెపల్లి రైతు సేవా కేంద్రంలో గురువారం కౌలు రైతు కార్డులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్డు పొందిన ప్రతి కౌలు రైతుకు ప్రభుత్వ పరంగా అనేక రాయితీలు లభిస్తాయన్నారు. సబ్సిడీపై విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందుతుందన్నారు.