భట్టిప్రోలు మండల టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. భట్టిప్రోలు గ్రామంలోని మార్కెట్ వద్ద గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఆనందబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, బూత్, గ్రామ కమిటీలను పూర్తి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.