వేమూరు: పిడుగుపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు చెక్కు పంపిణీ

75చూసినవారు
పిడుగు పడి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు చెక్కును వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అందజేశారు. ఈనెల 4వ తేదీన కొల్లూరు మండలం గాజులంక గ్రామంలో కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన మాతంగి సుప్రదీప్ పిడుగు పడి మృతి చెందాడు. సుప్రదీప్ కుటుంభ సభ్యులకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి మంజూరైన నాలుగు లక్షల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే నక్క ఆనందబాబు శుక్రవారం అందజేశారు.

సంబంధిత పోస్ట్