ఈనెల 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నూజెండ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్సై లక్ష్మీనారాయణ రెడ్డి ఆదివారం తెలిపారు. కౌంటింగ్ అనంతరం గ్రామాల్లో ఎటువంటి బాణసంచా కాల్చరాదని, సభలు ఏర్పాటు చేయకూడదని చెప్పారు. రెచ్చగొట్టే నాయకులు, వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.